వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 24: మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఉదయం ఊహించని ఘటన చోటుచేసుకుంది. కార్యాలయంలోని అకౌంట్స్ సెక్షన్ గదిలో ఒక్కసారిగా నేల సుమారు ఒక అడుగు లోతుకు కుంగిపోయింది.ఈ ఘటనతో గదిలో ఉన్న ఫర్నిచర్, ఇతర సామగ్రి కిందపడిపోయి అస్తవ్యస్తంగా మారాయి. అయితే ఘటన జరిగిన సమయంలో గదిలో ఎలాంటి సిబ్బంది లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.మున్సిపల్ కార్యాలయం లోపలే నేల కుంగిపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. భవన నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాల్లో నాణ్యత, భద్రతా ప్రమాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
Reporter
వాస్తవ గమ్యం