వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ నేపథ్యంలో జ్యోతిబా ఫూలే 1827, ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారాలో జన్మించారు. థామస్ పైన్ రాసిన “ది రైట్స్ ఆఫ్ మ్యాన్” గ్రంథం ఆయనలో సామాజిక చైతన్యాన్ని నింపింది. స్త్రీ విద్యకు ప్రాధాన్యత: సమాజంలో అవిద్య, కుల వివక్ష వల్ల స్త్రీలు వెనుకబడి ఉన్నారని గుర్తించిన ఆయన, వారి విద్యాభివృద్ధి కోసం విశేష కృషి చేశారు. విద్య ద్వారానే సమానత్వం సాధ్యమని నమ్మి, బడుగు బలహీన వర్గాల కోసం పాఠశాలలను స్థాపించారు. అణగారిన వర్గాల హక్కులు, రైతుల సమస్యల కోసం నిరంతరం పోరాడారు.సామాజిక సేవకు గుర్తింపుగా 1888లో ఆయనకు “మహాత్మా” బిరుదు ప్రదానం చేశారు. ఆయన ఆలోచనలే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి స్ఫూర్తిగా నిలిచాయి.ఫూలే ఆశయాలను ఆచరించడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి." అని — తుంగపిండి రాజలింగు, మున్సిపల్ కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొని ఫూలే సేవలను స్మరించుకున్నారు.
Reporter
వాస్తవ గమ్యం