Wednesday, 29 July 2026 05:44:21 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

​మందమర్రి మున్సిపాలిటీలో ఘనంగా జ్యోతిబా ఫూలే జయంతి

Date : 11 April 2026 04:30 PM Views : 116

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ నేపథ్యంలో జ్యోతిబా ఫూలే 1827, ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారాలో జన్మించారు. థామస్ పైన్ రాసిన “ది రైట్స్ ఆఫ్ మ్యాన్” గ్రంథం ఆయనలో సామాజిక చైతన్యాన్ని నింపింది. ​స్త్రీ విద్యకు ప్రాధాన్యత: సమాజంలో అవిద్య, కుల వివక్ష వల్ల స్త్రీలు వెనుకబడి ఉన్నారని గుర్తించిన ఆయన, వారి విద్యాభివృద్ధి కోసం విశేష కృషి చేశారు. విద్య ద్వారానే సమానత్వం సాధ్యమని నమ్మి, బడుగు బలహీన వర్గాల కోసం పాఠశాలలను స్థాపించారు. అణగారిన వర్గాల హక్కులు, రైతుల సమస్యల కోసం నిరంతరం పోరాడారు.సామాజిక సేవకు గుర్తింపుగా 1888లో ఆయనకు “మహాత్మా” బిరుదు ప్రదానం చేశారు. ఆయన ఆలోచనలే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి స్ఫూర్తిగా నిలిచాయి.ఫూలే ఆశయాలను ఆచరించడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి." అని — తుంగపిండి రాజలింగు, మున్సిపల్ కమిషనర్ అన్నారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొని ఫూలే సేవలను స్మరించుకున్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :