వాస్తవ గమ్యం / తెలంగాణ / నిర్మల్ : బోథ్ (అదిలాబాద్ జిల్లా): బోథ్ అటవీ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జూనియర్ అసిస్టెంట్ పరశురాం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.ఎన్ఆర్ఇజీఎస్ పనుల నిమిత్తం వచ్చిన వ్యక్తి నుండి నగదు స్వీకరిస్తుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఈ వ్యవహారం ఎఫ్ఆర్ఓ ప్రణయ్ కుమార్ ఆదేశాల మేరకు జరిగినట్లు గుర్తించారు.కేసులో ప్రణయ్ కుమార్ (A1), పరశురాం (A2)గా నమోదు చేసి అరెస్ట్ చేశారు.ఇద్దరినీ కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ మధు తెలిపారు.
Admin
వాస్తవ గమ్యం