వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలంటే ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పోలియో నివారణలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను సమీపంలోని పోలియో బూత్లకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని, ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా అధికారులు, వైద్య సిబ్బంది విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యం పోలియో రహిత సమాజ నిర్మాణమేనని, అందరి సహకారంతోనే అది సాధ్యమవుతుందన్నారు.జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం