Vastava Gamyam - తెలంగాణ / ఆదిలాబాద్ : ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వారోత్సవాలలో భాగంగా మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అని కార్యక్రమాలను డాక్టర్ బి.రాజశేఖర్ విస్తరణ శాస్త్రవేత్త, డాక్టర్ దేవా అనిల్ పంటల ఉత్పత్తి శాస్త్రవేత్త కొండపల్లి గ్రామం రెబ్బెన మండలంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం వ్యవసాయ శాఖ వారి సౌకర్యం సహకారంతో నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా.రైతులు అవసరానికి మించి యూరియా వాడకుండా, సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన పొందుతారు. దీంతో ఖర్చు తగ్గి, నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ వంటి రసాయనాలను సరైన మోతాదులో, సరైన సమయంలో వాడడం నేర్చుకుంటారు. ఇది పంటల నాణ్యతను పెంచుతుంది మరియు సాగు ఖర్చును తగ్గిస్తుంది.ఒకే పంటపై ఆధారపడకుండా, వివిధ పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు ఆదాయం స్థిరంగా ఉంటుంది.మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాలను ఎంపిక చేసుకోవడం. దీని ద్వారా రైతులు మెరుగైన ధర పొందగలుగుతారు.డ్రిప్, స్ప్రింక్లర్ వంటి నీటి సంరక్షణ పద్ధతులు నేర్చుకుని నీటిని సమర్థంగా వినియోగిస్తారు.రసాయనాల వినియోగం తగ్గించి, సేంద్రీయ పద్ధతులను అనుసరించడం వల్ల పంటల నాణ్యత, నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ శాంత పోచం, ఏఇఓ కృపామణి,రైతులు పాల్గొనడం జరిగింది.
Reporter
Vastava Gamyam