Saturday, 12 September 2026 09:06:18 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

బహుజన రాజ్య స్థాపనే లక్ష్యం: బీఎస్పీ జిల్లా సమీక్షా సమావేశంలో పిలుపు

Date : 11 May 2026 06:24 PM Views : 664

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ ప్రాంగణంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించబడింది. జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జిలు కాదాసి రవీందర్, వరికిల్ల మల్లేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.మంచిర్యాల జిల్లాలోని ప్రతి గ్రామంలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని, బహుజన రాజ్య స్థాపన కోసం కార్యకర్తలు నడుం బిగించాలని నాయకులు పిలుపునిచ్చారు,ఈ నెల 13వ తేదీన జరగనున్న వరంగల్ జోన్-2 సమీక్షా సమావేశానికి జిల్లా, నియోజకవర్గ కమిటీల నాయకులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై చేరిన బండారి రాజ్‌కుమార్కు నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జిలుగా బండారి రాజ్‌కుమార్, పులాల రమేష్‌లను నియమిస్తున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ మెంబర్ నాగుల కిరణ్ బాబు, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దాగం శ్రీనివాస్, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు గాజుల శంకర్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.బహుజన బంధువులారా ఏకం కండి.. రానున్నది ఏనుగు ప్రభుత్వమే!" అని నాయకులు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: