వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ ప్రాంగణంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించబడింది. జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జిలు కాదాసి రవీందర్, వరికిల్ల మల్లేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.మంచిర్యాల జిల్లాలోని ప్రతి గ్రామంలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని, బహుజన రాజ్య స్థాపన కోసం కార్యకర్తలు నడుం బిగించాలని నాయకులు పిలుపునిచ్చారు,ఈ నెల 13వ తేదీన జరగనున్న వరంగల్ జోన్-2 సమీక్షా సమావేశానికి జిల్లా, నియోజకవర్గ కమిటీల నాయకులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై చేరిన బండారి రాజ్కుమార్కు నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జిలుగా బండారి రాజ్కుమార్, పులాల రమేష్లను నియమిస్తున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ మెంబర్ నాగుల కిరణ్ బాబు, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దాగం శ్రీనివాస్, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు గాజుల శంకర్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.బహుజన బంధువులారా ఏకం కండి.. రానున్నది ఏనుగు ప్రభుత్వమే!" అని నాయకులు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
Admin
వాస్తవ గమ్యం