Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అక్రమ మద్యం రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు.దాదానగర్ గ్రామం వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న స్కూటీని ఆపి తనిఖీ చేయగా 700 దేశీ దారు బాటిళ్లు (సుమారు 63 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి కాగజ్నగర్లో అధిక ధరకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసిన మద్యం విలువ సుమారు రూ.25,200గా అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Admin
Vastava Gamyam