వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : పార్లమెంటులో సాక్షాత్తు నీట్ ప్రశ్న పత్రం లీకేజీ విషయంలో చర్చ జరపడానికి సిద్ధమని ఒక ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వినకుండా అత్యంత సురక్షిత ప్రాంతంగా భావించే ప్రధానమంత్రి ఇంటి ముందు. ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారని భాజపా జిల్లా అధ్యక్షులు నగునూరీ వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు.నిన్న ప్రధాని నివాస గృహం ముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినందుకు నిరసనగా నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ చిత్రపటాన్ని మంచిర్యాల ఐబీ చౌరస్తాలో దహనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య యుతంగా హైదరాబాదులో నిరసన వ్యక్తం చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ని రాష్ట్ర నాయకులను అరెస్టు చేయడం ఈ ప్రభుత్వం యొక్క అణిచివేత విధానానికి నిదర్శనమని ఆయన అన్నారు పార్లమెంట్ సభ్యులు వంశీ దేశ ప్రధానిని విధ్వంసం సృష్టించే వ్యక్తిగా చిత్రీకరించడం పిరికి వ్యక్తి అని సంబోధించడం నీట్ పేపర్లు అమ్ముకున్నాడని మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు ఈ దేశాన్ని ప్రగతి పథం లో నడిపిస్తున్న దేశ ప్రధానిని విధ్వంసం సృష్టించే వ్యక్తిగా చిత్రీకరించడం వంశీ యొక్క రాజకీయ పరిణితి లేదన్న విషయాన్ని తెలియజేస్తుందని ఆయన అన్నారు గతంలో మీ నాయన ఐదు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు మోడీ విధ్వంసం మీకు కనబడలేదా అని ఆయన ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అమ్మిరి శెట్టి రాజ్ కుమార్ పెద్దపల్లి పురుషోత్తం ఆంజనేయులు పట్టి వెంకటకృష్ణ పచ్చ స్వప్న రాణి మోతే సుజాత ప్రేమ్ సింగ్ పానుగంటి మధు వైద్య శ్రీధర్ మేరడగొండ శ్రీనివాస్ బొట్ల సత్యం శతరుణ్ సింగ్ బుద్ధారపు రాజమౌళి గుండా రాజబాబు రాకేష్ రేణు గందె శ్రీనివాస్ ముల్కళ్ళ కుమార్ ఇప్ప సురేష్ ఆడపు కుమారస్వామి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం