వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా, జూలై 1: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న 'రాజ్యాధికార సమరభేరి' మహాసభకు హాజరుకావాలని కోరుతూ చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలకు ఆహ్వాన పత్రికను అందజేశారు.మంచిర్యాల జిల్లా రాజ్యాధికార పార్టీ కో-కన్వీనర్ కోరే రంజిత్ కుమార్, నల్లాల ఓదెల స్వగృహానికి వెళ్లి మహాసభ ఆహ్వాన పత్రికను అందించి,సభకు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రవీందర్ యాదవ్, మందమర్రి మండల నాయకులు కొక్కెర రాజు కురుమతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం