వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చందనగిరి శ్రీనివాస్కు రాష్ట్ర స్థాయిలో కీలక పదవి దక్కింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.హైదరాబాద్లో చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా చందనగిరి శ్రీనివాస్ తన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్కు మంత్రి వివేక్ ప్రత్యేక అభినందనలు తెలిపి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.చందనగిరి శ్రీనివాస్ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధిష్ఠానానికి, మంత్రి వివేక్ వెంకటస్వామికి, ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విస్తరణకు, ఎస్సీ వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. శ్రీనివాస్కు రాష్ట్ర స్థాయి పదవి దక్కడం పట్ల క్యాతనపల్లి, చెన్నూరు పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Admin
వాస్తవ గమ్యం