వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 24: సింగరేణి సంస్థలో జనరల్ మేనేజర్ (E&M) అండర్గ్రౌండ్ మైన్స్గా సేవలందిస్తున్న శ్రీ వై. రఘురామిరెడ్డి త్వరలో పదవీ విరమణ చేయనున్న సందర్భంగా బుధవారం మందమర్రి ఏరియాకు విచ్చేశారు. ఈ సందర్భంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎన్. రాధాకృష్ణ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామిరెడ్డి సుదీర్ఘ సేవలను, సంస్థ అభివృద్ధికి అందించిన విశేష కృషిని అధికారులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఓ టు జి.ఎం శ్రీ జి.ఎల్. ప్రసాద్, కేకే ఓ.సి. ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ రాంబాబు, కేకే ఏజెంట్ శ్రీ కాదిర్, ఎస్.కె ఏజెంట్ శ్రీ సంతోష్ కుమార్తో పాటు మందమర్రి ఏరియాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొని రఘురామిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం