వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించిన 2024-25 జాతీయ ఉత్తమ గనుల ర్యాంకింగ్స్లో సింగరేణి సంస్థ మరోసారి తన ప్రతిభను చాటుకుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 50 అత్యుత్తమ గనుల్లో ఐదు సింగరేణి గనులు చోటు దక్కించుకుని ప్రతిష్ఠాత్మక 5-స్టార్ రేటింగ్ను సొంతం చేసుకోవడం విశేషం. ఆర్కే న్యూటెక్, ఆర్కే-6, జేవీఆర్ ఓసీ-2, ఖైరిగూడ, ఆర్జే ఓసీ-1 గనులు ఈ అత్యున్నత గుర్తింపు పొందాయి. అదనంగా సంస్థకు చెందిన మరో 17 గనులు 4-స్టార్ రేటింగ్ సాధించడం సింగరేణి పనితీరు, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణలో ఉన్నత స్థాయిని మరోసారి నిరూపించింది. ఈ అరుదైన విజయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యం, అధికారులు, కార్మికులను అభినందిస్తూ, జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని మరింత పెంచినందుకు ప్రశంసించారు.
Reporter
వాస్తవ గమ్యం