వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలో ఆదివాసీ నాయకపోడ్ సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కీ.శే. మద్ది రాంచందర్ వర్ధంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మందమర్రి మండల ఆదివాసీ నాయకపోడ్ సేవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడ్ సేవ సంఘం జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్, గౌరవ అధ్యక్షులు లౌడం రాజుకుమార్, రాష్ట్ర నాయకులు మెషినేని రాజన్న పాల్గొని మాట్లాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పెద్ది రాజన్న, ఏదుల రాజమల్లుతో పాటు గాంధారి ఖిల్లా మైసమ్మ ఆలయ కమిటీ పూజారులు దైనేనీ రమేష్, శ్రీధర్, మహేందర్, లక్ష్మణ్, ప్రదీప్ మరియు సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Admin
వాస్తవ గమ్యం