Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ గ్రౌండ్లో కొడకండ్ల వైకుంఠం-ఉదయమ్మల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ‘స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్’ గురువారం ఘనంగా ప్రారంభమైంది.ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరీ స్వామి, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ టాస్ వేసి టోర్నమెంట్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇలాంటి క్రీడా పోటీలు మరిన్ని జరగాలని, ఇక్కడి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇంతటి ఘనమైన పోటీలను నిర్వహించిన రఘు, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ మరియు వారి బృందాన్ని అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు ప్రారంభ మ్యాచ్లో హాజీపూర్ పోలీస్ బెటాలియన్ మరియు పెద్దపల్లి జట్లు తలపడ్డాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు మరియు స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam