Wednesday, 29 July 2026 05:45:18 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

బెల్లంపల్లిలో సింగరేణి భూములు స్వాధీనం.

రంగంలోకి దిగిన సెక్యూరిటీ, అటవీ అధికారులు

Date : 22 June 2026 01:29 PM Views : 146

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి ఏఎంసి (వ్యవసాయ మార్కెట్ కమిటీ) పరిధిలోని సింగరేణి ప్రాంతంలో కొన్నేళ్లుగా ఆక్రమణకు గురైన విలువైన సింగరేణి భూములను అధికారులు విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణదారుల నుంచి సంస్థ ఆస్తులను రక్షించేందుకు సింగరేణి సెక్యూరిటీ వింగ్ (ఎస్‌అండ్‌పీసీ) మరియు అటవీ శాఖ (ఫారెస్ట్) అధికారులు ఉమ్మడిగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.బేల్లెంపల్లి ఏరియా సింగరేణి పరిధిలోని సదరు భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లినట్లు నిర్దిష్ట సమాచారం అందడంతో సింగరేణి ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సింగరేణి రక్షణ విభాగం మరియు ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో ఫీల్డ్‌లోకి దిగారు. ఆక్రమణలను పూర్తిగా తొలగించి, ఆ భూమిని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.ప్రభుత్వ మరియు సింగరేణి లీజు భూములను కబ్జాదారుల బారి నుండి రక్షించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న స్థలాల చుట్టూ రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో చొరవ చూపిన సింగరేణి సెక్యూరిటీ మరియు అటవీ అధికారులను సంస్థ ఉన్నతాధికారులు అభినందించారు. భవిష్యత్తులోనూ సింగరేణి భూములపై ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

G ASHOK

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :