Saturday, 12 September 2026 09:04:11 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

బెల్లంపల్లిలో సింగరేణి భూములు స్వాధీనం.

రంగంలోకి దిగిన సెక్యూరిటీ, అటవీ అధికారులు

Date : 22 June 2026 01:29 PM Views : 186

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి ఏఎంసి (వ్యవసాయ మార్కెట్ కమిటీ) పరిధిలోని సింగరేణి ప్రాంతంలో కొన్నేళ్లుగా ఆక్రమణకు గురైన విలువైన సింగరేణి భూములను అధికారులు విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణదారుల నుంచి సంస్థ ఆస్తులను రక్షించేందుకు సింగరేణి సెక్యూరిటీ వింగ్ (ఎస్‌అండ్‌పీసీ) మరియు అటవీ శాఖ (ఫారెస్ట్) అధికారులు ఉమ్మడిగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.బేల్లెంపల్లి ఏరియా సింగరేణి పరిధిలోని సదరు భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లినట్లు నిర్దిష్ట సమాచారం అందడంతో సింగరేణి ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సింగరేణి రక్షణ విభాగం మరియు ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో ఫీల్డ్‌లోకి దిగారు. ఆక్రమణలను పూర్తిగా తొలగించి, ఆ భూమిని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.ప్రభుత్వ మరియు సింగరేణి లీజు భూములను కబ్జాదారుల బారి నుండి రక్షించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న స్థలాల చుట్టూ రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో చొరవ చూపిన సింగరేణి సెక్యూరిటీ మరియు అటవీ అధికారులను సంస్థ ఉన్నతాధికారులు అభినందించారు. భవిష్యత్తులోనూ సింగరేణి భూములపై ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

G ASHOK

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :