వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని గ్రామంలో వీవో భవన నిర్మాణానికి శుక్రవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. గ్రామ మహిళా సంఘాల కార్యకలాపాలకు శాశ్వత వేదిక కల్పించడంతో పాటు గ్రామాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ఈ భవనం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో మహిళా సంఘాల పాత్ర ఎంతో కీలకమని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.భూమి పూజ అనంతరం భవన నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులు సంబంధిత సిబ్బందికి సూచించారు. గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు విజయవంతంగా కొనసాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎదుల సుమలత, ఉపసర్పంచ్ పవన్ నంద్, ఎంపీఓ ప్రశాంత్, ఏఈ సుహాస్, గ్రామ సెక్రటరీ సాయి కృష్ణ, ఐకేసీ సీసీ సంతోష్, వార్డ్ సభ్యులు ముత్తే విజయలక్ష్మి, కట్నని విమల, గ్రామ సంఘ అధ్యక్షురాలు మంగ లక్ష్మి, నాయకులు లావణ్య సూరమ్మ, వీవోఏ విజయకుమారి, పెరుమాళ్ల వెంకటేష్, పడిగేలా అమర్, ఎదుల శ్రీనివాస్, ఎదుల భీమయ్య, బుద్దె బాణయ్య, బుద్దె చిన్నయ్య, చుంచు చంద్రమౌళి, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం