Wednesday, 29 July 2026 05:44:07 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

​మహేశ్వరంలో కలకలం 42 వేలకు పైగా రోహింగ్యాల దొంగ ఓట్లు బయటపెట్టిన బీజేపీ నేతలు!

Date : 06 July 2026 11:17 PM Views : 420

వాస్తవ గమ్యం / తెలంగాణ / హైద్రాబాద్ : తెలంగాణలోని మహేశ్వరం నియోజకవర్గంలో భారీ ఎత్తున అక్రమ ఓట్లు, రోహింగ్యా ముస్లింల ఓటర్ల నమోదు కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, స్థానిక బీజేపీ నాయకులు సంచలన విషయాలను గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వెల్లడించారు.మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అందే శ్రీరాములు యాదవ్ తన బృందంతో కలిసి గత నెల రోజులుగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. కేవలం 65 పోలింగ్ బూత్‌లలోనే దాదాపు 42,616 అక్రమ మరియు దొంగ ఓట్లు ఉన్నట్లు వారు గుర్తించారు.ఈ దొంగ ఓట్ల వెనుక ఉన్న విస్తుపోయే నిజాలను శ్రీరాములు యాదవ్ మీడియాకు వివరించారు.ఒకే ఇంట్లో తండ్రి వయసు 41 ఏళ్లు ఉంటే, కూతురి వయసు 39 ఏళ్లుగా ఓటర్ల జాబితాలో నమోదైంనట్టు స్థానిక హిందువుల ఇళ్ల నెంబర్లపై రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల పేర్లను ఓటర్లుగా చేర్చారు. అనేకమంది ఓటర్ల వివరాలలో తండ్రి పేరు స్థానంలో కేవలం 'సన్ ఆఫ్' అని మాత్రమే వదిలేశారు.స్థానిక నివాసితులు రోహింగ్యాల వల్ల పడుతున్న ఇబ్బందులను గ్రౌండ్ రిపోర్ట్‌లో పంచుకున్నారు. ఎలాంటి అధికారిక ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేకపోయినప్పటికీ, వీరికి ఉచిత నీటి కనెక్షన్లు, ఉచిత విద్యుత్, మొబైల్ ఫోన్లు, బైకులు మరియు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కూడా లభించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​గత శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థి విజయం వెనుక ఈ దొంగ ఓట్ల ప్యాకేజీల హస్తం ఉందని, ఒక ఏజెంట్ ద్వారా దాదాపు కోటిన్నర రూపాయల డీల్ నడిచిందని బీజేపీ నేతలు ఆరోపించారు.పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్ రాష్ట్రాల్లో అక్రమ ఓట్లను ఏ విధంగానైతే తొలగించారో, అదే విధంగా తెలంగాణలో కూడా తనిఖీలు జరిపి రోహింగ్యాల దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి (CEO) సమర్పించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

G ASHOK

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: