Tuesday, 28 July 2026 05:29:54 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

సార్ ప్రక్రియను 100శాతం పూర్తి చేయాలి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

Date : 13 July 2026 03:51 PM Views : 83

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : జైనూర్: మండలంలోని జంగాం, ఆశపల్లి, రాంనాయక్ తండా గ్రామాల్లో సోమవారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పర్యటించి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్ల వివరాల నమోదు, ఫారాల నింపడంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని సూచించారు.బీఎల్‌వోలు నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామంలో 100 శాతం ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, జంగాం గ్రామంలో ఇప్పటివరకు 64 శాతం, ఆశపల్లి గ్రామంలో 87 శాతం, రాంనాయక్ తండాలో 80 శాతం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఓటరు వివరాలు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఫారాలు నింపడంలో సహాయం చేయడంతో పాటు, ప్రతి ఇంటికి చేరుకుని అవగాహన కల్పించాలని కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఏలకు సుగుణక్క పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యవర్గం సభ్యులు షైక్ ముఖిద్, పెందోర్ ప్రకాష్,ఆత్మ చైర్మన్ రాథోడ్ రమేష్,సర్పంచ్లు పెందోర్ అనుసయ అర్జున్ రాథోడ్ రాందాస్ మర్ప రవీందర్ ఆత్రం శశిపాల్ చీర్లే లక్మణ్ అబ్దుల్లా మండల నాయకులు,బీఎల్‌ఏలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :