వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : జైనూర్: మండలంలోని జంగాం, ఆశపల్లి, రాంనాయక్ తండా గ్రామాల్లో సోమవారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పర్యటించి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్ల వివరాల నమోదు, ఫారాల నింపడంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని సూచించారు.బీఎల్వోలు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామంలో 100 శాతం ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, జంగాం గ్రామంలో ఇప్పటివరకు 64 శాతం, ఆశపల్లి గ్రామంలో 87 శాతం, రాంనాయక్ తండాలో 80 శాతం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఓటరు వివరాలు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఫారాలు నింపడంలో సహాయం చేయడంతో పాటు, ప్రతి ఇంటికి చేరుకుని అవగాహన కల్పించాలని కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఏలకు సుగుణక్క పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యవర్గం సభ్యులు షైక్ ముఖిద్, పెందోర్ ప్రకాష్,ఆత్మ చైర్మన్ రాథోడ్ రమేష్,సర్పంచ్లు పెందోర్ అనుసయ అర్జున్ రాథోడ్ రాందాస్ మర్ప రవీందర్ ఆత్రం శశిపాల్ చీర్లే లక్మణ్ అబ్దుల్లా మండల నాయకులు,బీఎల్ఏలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం