వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల, జూన్ 29: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలను సందర్శించిన ఆయన వంటశాల, తరగతి గదులు, రిజిస్టర్లు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, అదనపు గదులు వంటి మౌలిక సదుపాయాలతో పాటు పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని, ఉపాధ్యాయులు నాణ్యమైన బోధనతో పాటు ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను తల్లిదండ్రులకు వివరించి విద్యార్థుల చేరికలను పెంచాలని సూచించారు.
Reporter
వాస్తవ గమ్యం