వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలం శెట్పల్లిలో గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు కీలకమైన జనగణన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది.తొలిరోజు కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్లు ఇళ్ల గుర్తింపు, జాబితా నమోదు (లిస్టింగ్) పనులను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి జాగటి సరస్వతి గోపాల్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే ఈ గణనలో ప్రజలందరూ విధిగా పాల్గొనాలని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.గణన కోసం వచ్చే సిబ్బందికి కుటుంబాల వారీగా సరైన సమాచారం అందించి, ఈ ప్రక్రియ విజయవంతానికి సహకరించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ సుజాత, ఎన్యూమరేటర్లు పోశెట్టి, రామ్ మోహన్, మహేష్ బాబు, రాజబాబులతో పాటు పంచాయతీ కార్యదర్శి ప్రతిభా రాణి, కారోబార్ సతీష్,అన్నం వెంకన్న, గ్రామస్థులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం