Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం మంచిర్యాలలోని ప్రముఖ ఆరోగ్య హాస్పిటల్ (మల్టీ స్పెషాలిటీ, ట్రామా & క్రిటికల్ కేర్) వారి ఆధ్వర్యంలో ఈ ఆదివారం భారీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.స్థానిక సింగరేణి స్కూల్ గ్రౌండ్లో నిర్వహించబడే ఈ శిబిరం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు కొనసాగుతుంది. ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, సలహాలు అందజేయనున్నారు.ఈ శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులు అందుబాటులో ఉంటారు: డా॥ బి. భరత్ (MBBS, MD) – జనరల్ ఫిజీషియన్ డా॥ ఎం. రాజేష్ కుమార్ (MBBS, MS) – జనరల్ & లాప్రోస్కోపిక్ సర్జన్ డా॥ మోర వెంకటేశ్వర్లు (MBBS, DNB) – అనస్థీషియా & క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డా॥ కె. ప్రియాంక (MBBS, D.G.O) – ప్రసూతి, స్త్రీ వైద్య నిపుణులు & ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ వేదిక: సింగరేణి స్కూల్ గ్రౌండ్, మందమర్రి. తేదీ & సమయం: ఈ ఆదివారం, ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు. హస్పిటల్ చిరునామా: డొమినోస్ పిజ్జా స్టోర్ పక్కన, బెల్లంపల్లి రోడ్, మంచిర్యాల. అత్యవసర సేవల కోసం: 7993 301 302. మందమర్రి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, గర్భిణీ స్త్రీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ మెడికల్ క్యాంప్కు అందరూ ఆహ్వానితులే.
Admin
Vastava Gamyam