Tuesday, 28 July 2026 08:08:01 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా నిర్వహించాం.

తహసిల్దార్ సతీష్ కుమార్

Date : 08 July 2026 05:33 PM Views : 384

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి మండలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు మండల తహసిల్దార్ పనకంటి సతీష్ కుమార్ శర్మ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, అర్హత ప్రమాణాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం గృహ పథకం కింద సొంత ఇల్లు లేని అర్హులకే ఇళ్లను కేటాయించినట్లు తెలిపారు. కేటాయింపుల జాబితాలో ఎవరైనా అనర్హులు ఉన్నట్లు ఎవరికైనా సమాచారం ఉంటే సంబంధిత ఆధారాలతో మండల తహసిల్దార్ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు లేదా దరఖాస్తు సమర్పించాలని సూచించారు.అందిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ నిర్వహించి, అనర్హులుగా తేలిన వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తామని చెప్పి కొందరు ప్రజలను మోసం చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించిన తహసిల్దార్, అలాంటి వ్యక్తుల మాటలను నమ్మి ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఇళ్ల కేటాయింపుకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే నేరుగా మండల తహసిల్దార్ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగానే కొనసాగుతాయని తహసిల్దార్ పేర్కొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :