వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి మండల తహసీల్దార్ పి. సతీష్ కుమార్కు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు మంగళవారం వినతిపత్రం సమర్పించారు.మందమర్రి మున్సిపాలిటీ శివారు పరిధిలోని సీలింగ్ పట్టా భూమి సర్వే నంబర్ 347/2లో మూడు ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఫామ్ హౌస్ నిర్మాణం జరుగుతోందని వారు ఆరోపించారు. 1/70 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వినతిపత్రంలో. పేర్కొన్నారు.అదేవిధంగా, ఆ భూమి యజమాని బూనేని రాజు (తండ్రి: భూమయ్య) సీలింగ్ పట్టా భూమిని ఇతర కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి విక్రయించగా, ప్రస్తుతం ఆ వ్యక్తి ఫామ్ హౌస్ నిర్మిస్తున్నారని ఆరోపించారు.ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లయితే సీలింగ్ పట్టాను రద్దు చేసి భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని, మందమర్రి పట్టణ జర్నలిస్టులకు ఇంటి స్థలాలుగా కేటాయించాలని బీఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడుముల్కల్లరాజేంద్రప్రసాద్, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గాజుల శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి మతిన్ ఖాన్, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ గోమాస బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం