వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : సిర్పూర్(టి) మండలం చింతకుంట గ్రామపంచాయతీలో గురువారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ ఆజ్మేర ఛత్రు నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో డీఎల్పీఓ హరిప్రసాద్, ఎంపీడీవో సత్యనారాయణతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సర్పంచ్, ప్రజాప్రతినిధులు–అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు స్పందించి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం