Tuesday, 28 July 2026 03:08:40 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

పంట పొలాల్లో అక్రమ విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: మందమర్రి పోలీసులు

Date : 02 July 2026 06:06 PM Views : 69

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి,జులై 2 : పంటలను అడవి జంతువుల నుంచి రక్షించేందుకు పొలాల చుట్టూ అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని మందమర్రి పోలీసులు హెచ్చరించారు. ఇటీవల కొంతమంది రైతులు కోతులు, అడవి పందులు, నీలిగాళ్లు తదితర జంతువుల నివారణ కోసం నేరుగా విద్యుత్ లైన్ల నుంచి కరెంట్ తీసుకుని పొలాల చుట్టూ తీగలు ఏర్పాటు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ విధంగా అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం వల్ల అమాయక ప్రజలు, పశువుల కాపరులు,వ్యవసాయ కూలీలు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అడవి జంతువులను నివారించేందుకు విద్యుత్ లైన్ల నుంచి నేరుగా కరెంట్ కనెక్షన్లు ఇవ్వడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. అక్రమ విద్యుత్ తీగల కారణంగా ఎవరికైనా ప్రాణనష్టం సంభవిస్తే, సంబంధిత భూ యజమాని లేదా కరెంట్ కనెక్షన్ ఏర్పాటు చేసిన వ్యక్తిపై నేరపూరిత మానవహత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని హెచ్చరించారు.పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ (ట్రాన్స్‌కో) అధికారులు సంయుక్తంగా పొలాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లు గుర్తిస్తే విద్యుత్ చట్టాల ప్రకారం భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని పేర్కొన్నారు. రైతులు పంటలను రక్షించేందుకు ప్రభుత్వం అనుమతించిన సోలార్ ఫెన్సింగ్ (తక్కువ వోల్టేజ్), నైలాన్ నెట్లు లేదా ఇతర సురక్షితమైన పద్ధతులను మాత్రమే వినియోగించాలని, నేరుగా విద్యుత్ తీగలను ఏర్పాటు చేయరాదని సూచించారు.అలాగే, అక్రమ విద్యుత్ కనెక్షన్లపై సమాచారం ఉన్న వారు వెంటనే మందమర్రి పోలీస్ స్టేషన్ లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :