వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : కరువు భత్యం తో కూడిన 50 శాతం కోల్ మైన్స్ పెన్షన్ పెంచేవిధంగా కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కి సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం వినతి పత్రం సమర్పించారు. సింగరేణి పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని MNR గార్డెన్ లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి , సికింద్రాబాద్ ఎంపీ జి కిషన్ రెడ్డి కి సింగరేణి లో మృతు గృ సింగరేణి వేల కోట్ల లాభాల బాట లో పయనింప చేయడానికి పాటు పడిన 80 వేల పై చిలుకు సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు అదే విధంగా కోల్ ఇండియా వ్యాప్తంగా పదవి విరమణ చేసిన బొగ్గు పెన్షన్ దారులకు గత 25 సంవత్సరాల కాలం నుండి పెంపుదలకు నోచుకోని కోల్ మైన్స్ పెన్షన్ను కరువు భత్యం తో కూడిన 50 శాతం వరకు బొగ్గు పెన్షన్ పెంచే విధంగా కృషి చేయాలని మంచిర్యాల జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. అదే విధంగా అతి తక్కువ పెన్షన్ 300 నుండి 1000 లోపల బొగ్గు పెన్షన్ దారులకు కనీస పెన్షన్ నెలకు 15 వేలుగా నిర్ణయించాలని , CPRMS మెడికల్ కార్డు ద్వారా 8 లక్షలకు బదులు 25 లక్షల వరకు పెంచాలని కోరారు.
Reporter
వాస్తవ గమ్యం