వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కొమురవెల్లి ఐకెపి సెంటర్ ను పరిశీలించిన డిఎస్పి అశోక్. ఈ సందర్భంగా డి.ఎస్.పి అశోక్ మాట్లాడుతూ రైతులు ఎండకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ధాన్యాన్ని వీలైనంత ఎండబెడుతూ మైచర్ వచ్చే విధంగా చూసుకోవాలని రైతులను కోరారు. అధిక ఎండల కారణంగా రైతులు ఎప్పటికప్పుడు తగినంత నీరు తీసుకుంటూ నీడ పట్టున ఉండాలని తెలిపారు. ఐకెపి సెంటర్ అధికారులు కూడా రైతులకు అందుబాటులో ఉంటూ ధాన్యం తడవకుండా ఉండేందుకు తార్పాలిన్ కవర్స్ అందుబాటులో ఉంచాలని అలాగే రైతులకు మైచర్ వచ్చిన వెంటనే గని బ్యాగ్స్ రైతులకి అందించి ధాన్యాన్ని కాంట చేసేలా చూడాలని అధికారులకు సూచించారు.డి.ఎస్ .పి అశోక్ తో పాటు, రెబ్బన సిఐ సంజయ్, మరియు ఎస్సై వెంకటకృష్ణ పాల్గొన్నారు.ఐకెపి సెంటర్ ని పరిశీలించిన రెబ్బన మండల ఎమ్మార్వో సూర్య ప్రకాష్ రెబ్బన మండల ఎమ్మార్వో ఐకెపి సెంటర్ ని పరిశీలించి రైతులకు తగిన సూచనలు చేశారు. ఐకెపి సెంటర్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు మై చర్చ్ చెక్ చేస్తూ రైతులకు అందుబాటులో ఉండాలని అధికారులకు తెలిపారు.
Admin
వాస్తవ గమ్యం