Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : హైదరాబాద్: జపాన్లోని హిరోషిమా రాష్ట్ర ప్రజా ప్రతినిధులు శుక్రవారం శాసన మండలి కమిటీ హాల్లో తెలంగాణ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్బాబు జపాన్ సంస్థలు తెలంగాణలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాలని కోరారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించాలని, వ్యవసాయ సాంకేతికత, వైద్య రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారం పెంపొందించాలని సూచించారు.కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు డా. బల్మూర్ వెంకట్, డా. దాసోజు శ్రవణ్, అంజి రెడ్డి, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam