వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : సైబర్ నేరాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోలీస్ సైబర్ వారియర్స్కు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ శిక్షణ కార్యక్రమంలో సైబర్ నేరాల స్వరూపం, వాటిని ముందుగానే గుర్తించే విధానాలు, అలాగే సైబర్ నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమగ్రంగా వివరణ ఇచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ సైబర్ వారియర్స్కు సైబర్ టీ-షర్ట్స్ను అందజేసి, ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంచడంలో వారు కీలక పాత్ర పోషించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిసిఆర్బి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి, సైబర్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ దివ్య మరియు సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం