Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం కల్యాణిఖనిలోని సింగరేణి కాలరీస్ హైస్కూల్ (ఎయిడెడ్)లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 1, 2026 నుండి జులై 30, 2026 వరకు ఈ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జె. పురుషోత్తం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల యొక్క ప్రత్యేకతలు మరియు సాధించిన విజయాలను వెల్లడించారు: 2025-26 విద్యా సంవత్సరం పదవ తరగతి ఫలితాలలో పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇద్దరు విద్యార్థులు 555/600 మార్కులు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలవగా, మరో 10 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించి విశేష ప్రతిభ చాటరు అర్హత కలిగిన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఇక్కడ నాణ్యమైన విద్యాబోధన అందుతోంది. డిజిటల్ తరగతి గదులు, సైన్స్ ప్రయోగశాలలు (ల్యాబ్స్) మరియు గ్రంథాలయ సౌకర్యం కలవు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యతో పాటు పరిశుభ్రమైన, సురక్షితమైన మరియు విద్యార్థి-స్నేహపూర్వక వాతావరణం ఈ పాఠశాల సొంతం.కావున, తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించాలనుకునే ఆసక్తి గల తల్లిదండ్రులు అవసరమైన ధృవపత్రాలతో పాఠశాల కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. జూన్ 30, 2026 లోపు ప్రవేశాలను ఖరారు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులు శ్రీ జె. పురుషోత్తం సూచించారు.మరిన్ని వివరాలకు పాఠశాల ఫోన్ నంబర్ 08736-220602 లేదా ఈమెయిల్ schs_kk@scclmines.com ద్వారా సంప్రదించవచ్చు.
Admin
Vastava Gamyam