వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కాగజనగర్ పట్టణంలోని సంతోష్ గార్డెన్లో ఉపాధ్యాయులు రాయి సిడాం అనిత–లక్ష్మణ్ దంపతుల కుమారుడు సాయికృష్ణ, శ్రీజల వివాహం జరిగింది.ఈ వివాహానికి తెలంగాణా రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం (టి ఎస్ టి డబ్ల్యు టి యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.అశోక్, జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.కార్యక్రమంలో జిల్లా నాయకులు కొమురం మాధవరావ్, కుమారం శంకర్, తలండి శంకర్, కుర్సెంగా దౌలత్, బోగారపు శంకర్, అజ్మీరా రవీందర్, సబ్బాని అభినవ్, గుగ్లోత్ గోపాల్, బానోత్ నాగేష్, లావుద్యా నాగరాజ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
Admin
వాస్తవ గమ్యం