వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 24: మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేధింపుల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా. పోలీసులు పనిచేస్తున్నారని మంచిర్యాల జిల్లా షి టీమ్ ఎస్ఐ ఉషారాణి తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ (డీఐజీ) ఆదేశాలు, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఐపీఎస్ పర్యవేక్షణలో బుధవారం మందమర్రిలోని మహిళా శక్తి భవనంలో తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) మండల సమాఖ్య ఉద్యోగులకు షి టీమ్ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా షి టీమ్ సిబ్బంది మహిళల భద్రత కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలు, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, టీ-సేఫ్ యాప్ వినియోగం, షి టీమ్ సేవలపై సమగ్ర అవగాహన కల్పించారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైన వెంటనే రామగుండం షి టీమ్ నంబర్ 6303923700, మంచిర్యాల షి టీమ్ నంబర్ 8712659385 లేదా అత్యవసర సేవల కోసం డయల్-100కు ఫోన్ చేయాలని సూచించారు. సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్లైన్ను సంప్రదించాలని తెలిపారు.అలాగే ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షి టీమ్ కానిస్టేబుళ్లు సతీష్, జ్యోతి, మందమర్రి ఏపీఎం చంద్రశేఖర్తో పాటు వివిధ గ్రామ సంఘాల సెర్ఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం