వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని మాజీ ఆర్మీ జవాన్, ప్రస్తుత ఎస్ అండ్ పిసి ఉద్యోగి రాజేష్ పివ్ హాల్ - రాణి పివ్ హాల్ దంపతులు తమ నివాసంలో భారత స్వాతంత్ర్య సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి యువతకు దేశ స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను తెలియజేయడానికే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. 1887 జూన్ 11న జన్మించిన బిస్మిల్.. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరని, భగత్ సింగ్ చేత గొప్ప కవిగా ప్రశంసలు అందుకున్నారని గుర్తుచేశారు. మణిపూర్, కకోరి కుట్ర వంటి ఉద్యమాల్లో పాల్గొని, ఆర్యసమాజ్తో అనుబంధం కలిగి ఉండి, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడి డిసెంబర్ 19, 1927న ఆయన అమరులయ్యారని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు బిస్మిల్ అని వారు కొనియాడారు.
Admin
వాస్తవ గమ్యం