వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో ఓపెన్ 10వ తరగతి,ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎంఈఓ వాసాల ప్రభాకర్ తెలిపారు. మండలంలో 3 కేంద్రాలు ఏర్పాటు చేయగా,మొత్తం549 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు ఉదయం9నుంచి12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు.అన్ని కేంద్రాల్లో సిబ్బంది నియామకం, సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
Admin
వాస్తవ గమ్యం