Sunday, 13 September 2026 10:51:07 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

పేకాట స్థావరంపై కోటపల్లి పోలీసుల దాడి నలుగురు అరెస్ట్

ఎస్సై రాజశేఖర్

Date : 12 July 2026 04:01 PM Views : 69

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కోటపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.12,640 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.జూలై 11న విశ్వసనీయ సమాచారం మేరకు కోటపల్లి ఎస్‌ఐ ఎస్. రాజశేఖర్ పోలీసు సిబ్బందితో కలిసి ఆల్గాం గ్రామ శివారులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్గాం గ్రామంలోని ఎస్‌ఆర్‌ఆర్ ఫర్టిలైజర్ షాప్ వద్ద కొందరు డబ్బులు పందెంగా పెట్టుకొని మూడు ముక్కల పేకాట ఆడుతుండగా ఆకస్మికంగా దాడి చేశారు.పోలీసులను గమనించిన ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటనా స్థలంలో దుర్గం రామ్‌దేవ్, గట్టు తిరుపతి గౌడ్, గారె రాజలింగు, అల్లూరి అభిషేక్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పరారైన వ్యక్తులు గట్టు శ్రీనివాస్, రామ్‌టెంకి సునీల్‌గా గుర్తించారు. స్వతంత్ర పంచుల సమక్షంలో నిందితుల వద్ద నుంచి రూ.12,640 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఎస్‌ఐ ఎస్. రాజశేఖర్‌తో పాటు హెడ్ కానిస్టేబుల్ బుజ్జిబాబు, కానిస్టేబుళ్లు శ్రావణ్, నరేష్ మరియు టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పేకాట, జూదం, మాదకద్రవ్యాలు, గుడుంబా తయారీ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపింది. ఇటువంటి కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-112కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: