వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూలై 1: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ ఆదివారం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రాజ్యాధికార సమరభేరి మహాసభకు హాజరుకావాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్కు పార్టీ నాయకులు ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా కో-కన్వీనర్ కోరే రంజిత్ కుమార్, జిల్లా నాయకులు ఆర్కటి రవీందర్ యాదవ్, చిట్టబోయిన రాజు యాదవ్ తదితరులు బండి సదానందం యాదవ్ను కలిసి మహాసభ విశిష్టతను వివరించి, కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం