వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని కరీంనగర్లోని ఆయన నివాసంలో మున్నూరు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ ఆదేశాల మేరకు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగాం రాజారామ్ పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమశేఖర్ పటేల్, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు గజ్జల లక్ష్మణ్ పటేల్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సంఘ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని నాయకులు కోరగా, సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని చైర్మన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి మిట్ట దేవేందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందూరి తిరుపతి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి అన్నం రమేష్ ,జిల్లా కార్యదర్శి అంగాల తిరుపతి, జిల్లా కార్యదర్శి దేవర నేని రవీందర్, జిల్లా నాయకులు గోవిందుల రాజన్న, కస్తూరి అఖిలేష్, సుంకరి వెంకన్న, కొత్తిమీర సర్పంచ్ నాయకిని సత్యనారాయణ, అంబిలపు అశోక్. తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం