Friday, 11 September 2026 02:47:57 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెంచాలి

Date : 11 August 2026 12:45 PM Views : 175

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల పట్టణంలో రేషన్ బియ్యం అక్రమ కొనుగోళ్లు, సేకరణ, నిల్వలు, ఇతర ప్రాంతాలకు తరలింపుపై అధికారులు నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పలు ప్రాంతాల్లో రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మంచిర్యాల పట్టణంలోని మార్కెట్, గౌతమి నగర్, కాలేజీ రోడ్‌లోని రేషన్ షాపుల పరిసరాలు, లక్ష్మీ థియేటర్, శ్రీనివాస థియేటర్ ప్రాంతాల్లోని కొన్ని షాపుల వద్ద రేషన్ బియ్యం అక్రమ కొనుగోళ్లు, తరలింపులు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరుతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమంగా సేకరించి వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలతో అర్హులైన లబ్ధిదారులు నష్టపోయే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ డీలర్ల వద్ద ఉన్న బియ్యం నిల్వలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలితే సంబంధిత డీలర్లపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే అనుమానాస్పద ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమంగా రేషన్ బియ్యం కొనుగోలు, నిల్వ, రవాణా చేస్తున్న వారిని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరం లేకపోయినా రేషన్ బియ్యం తీసుకుని విక్రయిస్తున్న లబ్ధిదారులు ఉంటే వారిని కూడా గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసి, ప్రభుత్వం అందిస్తున్న బియ్యం అర్హులైన పేదలకు చేరేలా అధికారులు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :