వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టదలచిన నిరసన కార్యక్రమానికి పోలీసులు ముందస్తుగానే అడ్డంకులు సృష్టించారు. ఇందులో భాగంగా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని మందమర్రి పోలీస్ స్టేషన్కు తరలించారు.అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్వీ నాయకులు ఎండి ముస్తఫా, దాసరి నవీన్, సీపెల్లి సాగర్, మాసు వెంకటేష్, బెల్లం అరుణ్, శనిగారపు అరుణ్ తదితరులు ఉన్నరు.ఎండి ముస్తఫా పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్వీ నాయకుడు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాము శాంతియుతంగా నిరసన తెలపడానికి ప్రయత్నిస్తే, అక్రమ అరెస్టులతో అణచివేయాలని చూడడం దుర్మార్గమన్నారు.23,000 ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని, వెంటనే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న అధిక ఫీజులను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలి - విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలి" అనే నినాదంతో విద్యార్థుల భవిష్యత్తు కోసం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం బీఆర్ఎస్వీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, విద్యార్థి లోకం పక్షాన తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు హెచ్చరించారు.
Reporter
వాస్తవ గమ్యం