Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలం మిట్టపల్లిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సర్పంచి కామేర మనోహర్, ఉప సర్పంచి కుమ్మరి రాజశేఖర్, వార్డు సభ్యులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ధాన్యంలో తాలు, తేమ లేకుండా జాగ్రత్తలు పాటించి కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు.రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ, సంక్షేమ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేయడం శుభపరిణామమని కొనియాడారు. అనంతరం సీసీఏ రాజన్న మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరగా ధాన్యం సేకరించి మిల్లులకు తరలిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఐకేపీ సీసీఏ అశ్విని, వీవో సభ్యురాలు స్వరూప, వార్డు సభ్యులు,రైతులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam