వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 27: మందమర్రి మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గ్రామానికి బోరు మంజూరు చేయించిన ఉపాధి కల్పన శాఖ మంత్రి, చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామికి గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామ ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి, ప్రజల అవసరాలకు వెంటనే స్పందిస్తూ సేవా భావంతో ముందుకు సాగుతున్న మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి నాయకత్వాన్ని గ్రామస్తులు అభినందించారు. ఆయన చొరవతో గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందే అవకాశం కలగడం పట్ల సారంగపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బచ్చలి రాములు, మండల అధ్యక్షుడు కడారి జీవన్ కుమార్, పట్టణ అధ్యక్షుడు తిరుమల, మండల అధికార ప్రతినిధి (స్పోక్స్ పర్సన్) రాయమల్లు, మాజీ సర్పంచులు కమల మనోహర్ రావు, అసనపల్లి రాజయ్య, వార్డు సభ్యుడు రమేష్, నాయకులు సంతోష్ రావు, తాజుద్దీన్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం