వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈ నెల 18న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయాధికారులు, న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా ఎన్ఐ యాక్ట్ (చెక్ బౌన్స్) కేసులతో పాటు ఇతర రాజీకి అనుకూలమైన కేసులను కూడా వేగంగా, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం వల్ల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు సంబంధిత పక్షాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న ఎన్ఐ యాక్ట్ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించే లక్ష్యంతో న్యాయవాదులు తమ ఖాతాదారులకు అవగాహన కల్పించి, ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకునేలా సహకరించాలని ఆయన కోరారు. రాజీ ద్వారా పరిష్కారానికి అవకాశం ఉన్న కేసుల పక్షాలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వివాదాలకు ముగింపు పలకాలని సూచించారు.
Reporter
వాస్తవ గమ్యం