వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ చిర్రకుంట గ్రామ సర్పంచ్ రమటెంకి, శ్రీలత(తిరుపతి) ఆధ్వర్యంలో, గ్రామ నాయకులు మరియు పెద్దల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా కప్పతల్లి వేడుకలను నిర్వహించారు. రైతులు విత్తుకున్న విత్తనాలకు, అలాగే సాగు పనులకు అనుకూలంగా ప్రస్తుతం ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, వర్ష దేవుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం పురాతన కాలం నాటి ఆచార సాంప్రదాయాల ప్రకారం గ్రామంలో ఈ రోజు "కప్పతల్లి ఆట" ఆడించారు. గ్రామ పెద్దలు సీనియర్ నాయకుడు రామచందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ పురాతన సాంప్రదాయం ప్రకారం కప్పతల్లి ఆట ఆడడం వల్ల ఖచ్చితంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, తద్వారా రైతులకు మేలు జరిగి పంటలు బాగా పండుతాయని తమ నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక నృత్యాలు చేస్తూ ఘనంగా నిర్వహించారు.
Admin
వాస్తవ గమ్యం