Saturday, 13 June 2026 09:41:50 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం

ఎంపీ వద్దిరాజు

Date : 08 June 2026 04:00 PM Views : 40

Vastava Gamyam - తెలంగాణ / హైద్రాబాద్ : కొత్తగూడెం: కృష్ణా, గోదావరి నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.కొత్తగూడెం క్లబ్‌ హాలులో సోమవారం బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి రూపొందించిన ‘ఈ-క్లాస్ యాప్’ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్నప్పటికీ.సీఎం రేవంత్ రెడ్డి ఉదాసీనత వల్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారని మండిపడ్డారు. దీనిపై కేసీఆర్ మార్గదర్శనంలో పార్లమెంట్‌లో ఎంపీలు దామోదర్ రావు, పార్థసారథి రెడ్డిలతో కలిసి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తామన్నారు. రాష్ట్రానికి నిధులు తేవడంలో, అన్యాయాలపై ప్రశ్నించడంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 16 మంది లోక్‌సభ సభ్యులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. 100 ఏళ్ల చరిత్ర గల కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ను డివిజన్‌గా చేయాలని, బస్తర్, మల్కాన్‌గిరి వరకు విస్తరించాలని కేంద్రానికి నివేదించామన్నారు. ఖమ్మం-కొత్తగూడెం-భద్రాచలం రోడ్డును ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల వరకు 4 లేన్లుగా మార్చాలని పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు త్వరలోనే ప్రారంభమవుతుందని. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలను ఎండగట్టేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా త్వరలో పాదయాత్ర చేయనున్నారని ప్రకటించారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని, భవిష్యత్తులో అసెంబ్లీ సీట్లు 119 నుండి 179కి పెరిగినా తెలంగాణలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాకేష్ రెడ్డి రూపొందించిన ఈ-క్లాస్ యాప్‌ను యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :