వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో నేతకాని మహర్ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సునార్కర్ రాంబాబు,రాష్ట్ర అధికార ప్రతినిధి గోళ్ల రాజమల్లు ఆరోపించారు.రాష్ట్రంలో 15 లక్షలకు పైగా ఉన్న నేతకానీలను, కులగణనలో కేవలం 1.70 లక్షలుగా చూపడంపై వారు మండిపడ్డారు.నేతకానీలను 'మాలసాలె'లతో కలపడం వల్ల సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోతున్నామని.తమను ప్రత్యేకంగా గుర్తించాలని డిమాండ్ చేశారు.వెంటనే నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేసి,చైర్మన్ను నియమించి నిధులు కేటాయించాలని రాష్ట్ర యువజన అధ్యక్షుడు అనపర్తి యువరాజు కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కామెర అనూష,జాడి తిరుపతి,కొండగొర్ల శ్రీనివాస్,దుర్గం శివరాం తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం