వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామ బస్టాండ్ వద్ద డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను బీజేపీ మండల అధ్యక్షులు బుర్ర రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, నాయకులు మిఠాయిలు పంపిణీ చేసి, మొక్కలు నాటారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 18వ వార్డు కౌన్సిలర్ ఏతం శివకృష్ణ హాజరవగా, పార్టీ నాయకులు ముంజం నారాయణ, జిముడ రాజారాం, జీల మల్లేష్, శేఖర్, నరేష్, కొట్రంగి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం