Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ వడాల రాములుని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.శుక్రవారం ఆయన కార్యాలయంలో కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు జిల్లాలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అడిషనల్ కలెక్టర్ గా నియమితులైనందుకు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, జిల్లా అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కాదాసి రవీందర్,జిల్లా ఈసీ మెంబర్ సెట్టి ప్రవళిక, ఎండీ.మాతిన్ ఖాన్,బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గోమాస బ్రహ్మానందం, మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్, బామ్ సేఫ్ జిల్లా కన్వీనర్ సెట్టి శంకరయ్య,అడ్వకేట్ నటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam