Tuesday, 28 July 2026 12:59:51 PM
# కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం # 54 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతం. # జైపూర్ ఎంపీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం.

అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి:

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 23 July 2026 07:29 PM Views : 17

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.గురువారం హాజీపూర్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భోజనశాల, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం, శుద్ధమైన తాగునీరు అందించాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు.అనంతరం హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించి, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు జాబితాలో నమోదు అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని, బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీల పనితీరు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా, జలసిరి పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.తదనంతరం లక్షెట్టిపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అత్యవసర విభాగం, వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. వర్షాకాలంలో అంటువ్యాధుల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్‌తో కలిసి అమృత్–2.0 పథకం పనులను పరిశీలించి, వాటిని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో వంటశాలను తనిఖీ చేసి, పరిశుభ్రత పాటిస్తూ తాజా నిత్యావసర సరుకులతో పౌష్టికాహారం సిద్ధం చేసి విద్యార్థులకు మెనూ ప్రకారం అందించాలని వంట సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: