Monday, 14 September 2026 10:58:52 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

బెల్లంపల్లిలో విజయవంతంగా 389వ వారపు అన్నదాన కార్యక్రమం

Date : 15 June 2026 05:29 PM Views : 108

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానం మహాదానం అనే మహోన్నత భావనతో అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలోని అన్నదాత ప్రాజెక్ట్, టెక్నో డ్యాన్స్ అకాడమీ సహకారంతో సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని కాంతా చౌరస్తా మరియు పల్లెటూరి బస్ స్టాండ్ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.ఆకలితో అలమటించే నిరుపేదలకు ప్రతి వారం నిరంతరంగా ఆహారం అందించాలనే లక్ష్యంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని 2020 ఏప్రిల్ 5న ప్రారంభించారు. దాతల సహకారం, అభ్యర్థన మేరకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం బెల్లంపల్లిలో విజయవంతంగా 389వ వారానికి చేరుకుంది.బాల గణేష్ యూత్ సభ్యులు (దబ్బు సాట్ లైన్ రోడ్ నెం.4, బెల్లంపల్లి) సహకారంతో సుమారు 200 మంది లబ్ధిదారులకు అన్నదానం నిర్వహించారు. ఇందులో భిక్షాటన చేసేవారు, నిరుపేదలు, రోజువారీ కూలీలు, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మ ఒడి అన్నదాత ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు, మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్ అజ్మీరా మోహన్, టెక్నో డ్యాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమండ్ల మధుకర్ మాట్లాడుతూ, 389వ వారపు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆకలితో బాధపడుతున్న వారికి ఆహారం అందించడం ద్వారా లభించే సంతృప్తి అపారమని, ఇది సమాజానికి అందించే విలువైన సేవ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి నిరంతరం సహకరిస్తున్న దాతలు, వాలంటీర్లకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హనుమండ్ల సువర్ణ, ఎం.డి. రేహానా, గన్నెవరం తిరుమలాచారి, మాతూరి వరప్రసాద్, చెందుపట్ల లింగమూర్తి, ఎం.డి. యూసుఫ్, బాల గణేష్ యూత్ సభ్యులు మరియు అమ్మ ఒడి వాలంటీర్లు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: