Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు.ఆసిఫాబాద్ బాలికల ఆశ్రమ పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ రీసోర్స్ పర్సన్ రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫామ్లు, సన్నబియ్యం భోజనం, సహపాఠ్య కార్యక్రమాలు అందిస్తూ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమ విద్య ద్వారా విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరుస్తున్నట్లు వివరించారు.
Admin
Vastava Gamyam